అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ద్రోహానికి పాల్పడినట్లు బిలియనీర్ ఎలన్ మస్క్ ఆరోపించారు. అమెరికా, మెక్సికో బోర్డర్ గోడ నిర్మాణం కోసం తెచ్చిన సామాగ్రిని అమ్మేసుకున్నట్లు బైడెన్పై మస్క్ విమర్శలు చేశారు. అమెరికా సరిహద్దుల్ని భద్రపరచడంలో బైడెన్ విఫలమైనట్లు దేశాధ్యక్షుడిగా ఎన్నికై ట్రంప్, రిపబ్లికన్లు విమర్శిస్తూనే ఉన్నారు. బోర్డర్ వాల్ నిర్మాణం కోసం తెచ్చిన సామాగ్రిని అమ్ముతున్నట్లు డిసెంబర్లో వార్తలు వ్యాపించడంతో బైడెన్ సర్కార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిహద్దుల్ని రక్షించుకోలేకపోవడం దేశద్రోహం అవుతుందని ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు మస్క్ రియాక్ట్ అయ్యారు. అవును అది నూరు శాతం దేశద్రోహమే అవుతుందని తన ట్విట్టర్ ఖాతాలో మస్క్ పేర్కొన్నారు.
0 Comments