Ad Code

భారీ ఎన్‌కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి !


త్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ లకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా డీఆర్‌జీ సైనికుడు మృతి చెందినట్టు సమాచారం. అభూజ్‌మడ్‌ అడవుల్లో 12 గంటలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.. కాగా అభూజ్ మడ్ అడువులను దంతేవాడ, బీజాపూర్, నారాయణపూర్, కొండగావ్ బలగాలు చుట్టుముట్టాయి. ఆపరేషన్ లో వేల సంఖ్యలో డీఆర్‌జీ, ఎస్‌టిఎఫ్, కోబ్రా సిబ్బంది పాల్గొన్నారు. అభూజ్ మడ్ అడువుల్లో ప్రత్యేక దళాలు కూంబింగ్ చేస్తుండగా.. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. కూంబింగ్ చేపడుతున్న బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగటంతో.. ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లి పోయింది. 

Post a Comment

0 Comments

Close Menu