మధ్యప్రదేశ్ లోని చిత్తార్పుర్కు చెందిన ఓ మహిళ వృద్ధాప్యంలో బాగోగులన్నీ చూసుకుంటానని హామీనిచ్చి, వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు ఇచ్చిన మాట తప్పడంతో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సి.టి.రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం... ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసింది. అనంతరం ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన 'తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం' అండగా నిలుస్తుందంటూ పేర్కొంది. ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు కన్నవారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని పేర్కొంది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి వాళ్లకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రైబ్యునళ్లకు ఉంటుందని న్యాయస్థానం స్పష్టంచేసింది. తద్వారా వృద్ధులైన తల్లిదండ్రులకు ఆర్థికపరమైన భరోసా లభిస్తుందని పేర్కొంది.
మిగిలిన ఆస్తిని కూడా ఇచ్చేయాలంటూ తమపై కన్న కొడుకే నిద్రాక్షిణ్యంగా దాడి చేస్తున్నాడంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అతనికి అప్పటికే గిఫ్ట్ డీడ్గా కొంత ఆస్తిని ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రేమ, ఆప్యాయతలు కనుమరుగైన పరిస్థితుల్లో ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆస్తిపై తమ హక్కును పునరుద్ధరించాలని ఆమె న్యాయస్థానాన్ని వేడుకుంది. దీనిపై విచారణ జరిపిన సబ్డివిజనల్ మేజిస్ట్రేట్. గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆ తండ్రి దండ్రుల పేరుమీద ఆస్తి హక్కును పునరుద్ధరించారు. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కూడా ఈ తీర్పును సమర్థించింది. అయితే, హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ తీర్పును కొట్టివేసి కుమారుడికే ఆస్తి దక్కుతుందంటూ పేర్కొంది. దీంతో బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించగా వృద్ధ దంపతుల హక్కులను పునరుద్ధరించింది. కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను క్యాన్సిల్ చేసింది. ఫిబ్రవరి నెలాఖరులోగా వృద్ధ దంపతులకు ఆస్తిని అప్పగించాలంటూ కుమారుడికి కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
0 Comments