Ad Code

కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనం !


హైదరాబాద్ నగర శివారు ప్రాంతం ఘట్‌కేసర్‌లో ప్రయాణిస్తున్న కారులో ప్రమాదవశాత్తూ ముగ్గురు సజీవ దహనం అయ్యారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురూ చిక్కుకుపోయారు. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో సజీవ దహనం అయ్యారు. కారు నుంచి మంటలు రావడంతో స్థానికులు భారీగా గుమిగూడారు. కారులోని వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో వాహనం వద్దకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కారులోని వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu