హైదరాబాద్లో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుర్మార్గ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. పోలీసులను వెంట తీసుకొచ్చి భాజపా కార్యాలయంపై రాళ్లు విసిరారని, పోలీసులు ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజమని హైదరాబాద్ సీపీని ప్రశ్నించారు. భాజపా తలచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్లమీద తిరగలేరని హెచ్చరించారు. రోజు రోజుకూ కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీ.. నిరాశతో భౌతిక దాడులకు దిగడాన్ని ప్రజలు క్షమించరన్నారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు, భౌతిక దాడులకు తావు లేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉందని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. దాడిపై సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
0 Comments