మహారాష్ట్రలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. దీని బారిన పడి నాగ్పూర్లో మూడు పులులు, ఓ చిరుత మరణించాయి. ఇక్కడి బాలా సాహెబ్ థాకరే గోరెవాడా జూపార్క్ అండ్ రెస్క్యూ సెంటర్లో కిందటి నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట్లో చంద్రాపూర్లో ఉండేవి ఈ వన్యమృగాలు అనారోగ్య బారిన పడటంతో వాటిని గోరేవాడా రెస్క్యూ సెంటర్కు తరలించారు. అక్కడ నిపుణుల సంరక్షణలో ఉండేవి. వ్యాధి తీవ్రతరం కావడం వల్ల డిసెంబర్ 20వ తేదీన ఒక పులి చనిపోయింది. అదే నెల 23వ తేదీన మరో రెండు మరణించాయి. వాటి మరణానికి దారి తీసిన వ్యాధి గురించి తెలుసుకోవడానికి రెస్క్యూ సెంటర్ సిబ్బంది ప్రయత్నించారు. వాటి కళేబరాల నుంచి శాంపిల్స్ను తీసుకుని భోపాల్లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు పంపించారు. తాజాగా వాటి నివేదికలు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులకు అందాయి. హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వల్లే మూడు పులులు, ఓ చిరుత మరణించినట్లు ఈ నివేదికల ద్వారా తేలింది. దీనితో అధికార యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని జులాజికల్ పార్కులు, అభయారణ్యాలు, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలు, వాటి రెస్క్యూ సెంటర్లకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హెచ్5హెచ్1 బర్డ్ ఫ్లూ మరింత విస్తృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు.
0 Comments