గుజరాత్లో 10 ఏళ్ల బాలిక 16 ఏళ్ల బాలుడితో పారిపోయిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం పెంచుకున్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే వీరిని సమీప గ్రామం నుంచి పోలీసులు పట్టుకుని జువైలన్ హోంకు తరలించారు. డిసెంబర్ 31న 5వ తరగతి చదువుతున్న బాలిక ధన్సురా గ్రామంలోని తన ఇంటి నుంచి కనిపంచకుండా పో యింది. గంటల తరబడి వెతికిన ప్రయోజనం లేకపోయింది. బాలికను కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఇన్స్టాగ్రామ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రేమలో పడ్డారని పోలీసు వర్గాలు కనుగొన్నాయి. డిసెంబర్ 31న వీరిద్దరూ పారిపోవాలని పథకం వేసి తమ ముగ్గురు స్నేహితుల సాయంతో పారిపోయారు. అమ్మాయి తండ్రికి సోషల్ మీడియా గురించి ఏమీ తెలియదు. 10 ఏళ్ల బాలిక తన తల్లి ఫోన్ నుంచి ఇన్స్టా ఉపయోగించిందని, అక్కడే వేరే గ్రామంలో నివసించే బాలుడితో పరిచయం ఏర్పడిందని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ తరుచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
0 Comments