Ad Code

ప్రశాంత్ కిషోర్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ !


జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్‌కు పాట్నా సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీనికి ముందు కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ ష్యూరిటీ బాండ్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆయనను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై పీకీ చేపట్టిన నిరాహార దీక్షను పాట్నా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైనందున అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.

Post a Comment

0 Comments

Close Menu