Ad Code

గోషామహల్ స్టేడియంలో పట్టుబడ్డ డ్రగ్స్ ను ధ్వంసం చేస్తాం : సీపీ సీవీ ఆనంద్


హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంలో నార్కోటిక్స్ వింగ్ ద్వారా పట్టుబడ్డ డ్రగ్స్ ను ధ్వంసం చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నిబంధనలు మేరకు వీటిని సీజ్ చేశామన్నారు. 2,140 కేజీల గంజాయి, 3.8 కేజీల మహకల్ మాదకద్రవ్యాలు, 12669 ఎంఎల్ హాష్ ఆయిల్, 540 అల్ప్రోజోళం టాబ్లెట్స్, 19.34 గ్రాముల కొకైన్, 4LSD బాటిల్స్, 177.75 గ్రాముల MDMA, 70గ్రాముల ఒపియం పట్టుకున్నట్లు తెలిపారు. 208 కేసుల్లో వీటిని సీజ్ చేసామని వీటన్నిటి విలువ 7.5 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది పట్టుకున్న మొత్తం డ్రగ్స్ నీ ధ్వంసం చేస్తున్నట్లు సీపీ తెలిపారు. గత మూడేళ్లుగా 1200 కేసులు నమోదు అయ్యాయని.. మాదకద్రవ్యాలు పట్టుకున్నవి మొత్తం మళ్ళీ ఎక్కడ వినియోగించకుండా ధ్వంసం చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని తెలిపారు. యువత చెడు పోకడలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వాటికి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ డ్రైవ్ రానున్న రోజుల్లో కూడా కొనసాగిస్తామని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ నీ కట్టడి చేస్తున్నామని వివరించారు. 

Post a Comment

0 Comments

Close Menu