Ad Code

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు !


అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆటో, ఫైనాన్స్‌ రంగ షేర్ల కొనుగోళ్ల మద్దతుతో కాసేపు రాణించాయి. తర్వాత ప్రధాన షేరల్లో మదుపర్లు విక్రయాలకు దిగగా నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా తీవ్ర ఒడుదొడుకుల్లో కదలాడిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 78,557.28 పాయింట్ల (క్రితం ముగింపు 78,472.87) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,173.38 - 78,898.37 మధ్య కదలాడింది. చివరకు 0.39 పాయింట్ల నష్టంతో 78,472.48 వద్ద స్థిరపడింది. ఇక ఇంట్రాడేలో 23,854.50 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 22 పాయింట్ల లాభంతో 23,750 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, జొమాటో, టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74 డాలర్లు వద్ద, బంగారం ఔన్సు 2,642 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 85.27 వద్ద ముగిసింది.

Post a Comment

0 Comments

Close Menu