హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ యాజమాన్యం స్పందించింది. సంధ్య థియేటర్కు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులకు థియేటర్ యాజమాన్యం సమాధానం పంపింది. మరికొన్ని వివరాలను కూడా జత చేసింది. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షోకు 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుందని వెల్లడించింది. ఇక, సినిమాల విడుదలకు గతంలోనూ హీరోలు థియేటర్కు వచ్చారని సంధ్య థియేటర్ యాజమాన్యం తెలిపింది. థియేటర్లో కార్లు, బైక్లకు ప్రత్యేక పార్కింగ్ ఉందని పేర్కొంది. ఈ మేరకు 6 పేజీల లేఖను సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపింది.
0 Comments