హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ భగీరథమ్మ చెరువు బఫర్ జోన్ లోని అక్రమ నిర్మాణాలను అధికారులు జేసీబీలతో హైడ్రా కూల్చివేయిస్తున్నారు. ఈ చెరువు బఫర్ జోన్లోని రెండు ఎకరాల స్థలంలోని కొంత భాగంలో ఇటీవల ఆక్రమణదారులు రేకుల షెడ్లు నిర్మించారు. ఈ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం నాడు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి భగీరథమ్మ చెరువు వద్దకు చేరుకొని జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేశారు.
0 Comments