తెలంగాణలోని మెదక్ జిల్లా మాసాయిపేట్ మండలం హకీంపేట్లో ఈ ఘోర ప్రమాదం శనివారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడినట్లు బాధితులు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షతగాత్రులు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
0 Comments