Ad Code

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు !


దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. వరుసగా రెండో రోజూ ఫ్లాట్‌గా ముగిశాయి. ఇన్ఫోసిస్‌, బజాజ్‌ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లల్లో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలవగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐలో విక్రయాలు సూచీలపై ఒత్తిడి తెచ్చాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,568.39 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,510.05) ఫ్లాట్‌గా ప్రారంభమైంది. కాసేపటికే స్వల్ప నష్టాల్లోకి జారుకొని తర్వాత లాభాల్లో కదలాడింది. సూచీలు.. ఇంట్రాడేలో 81,742.37 వద్ద గరిష్ఠాన్ని తాకాయి. చివరికి 16 పాయింట్ల లాభంలో 81,526.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.75 పాయింట్లు లాభంలో 24,641.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.84గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.81 డాలర్లు వద్ద, బంగారం ఔన్సు 2,725.80 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu