Ad Code

ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు


స్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు దాటిగా ఆడారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా,  ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ 68 పరుగులు, ప్యాట్ కమ్మిన్స్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మొదటి మ్యాచ్ ఆడుతున్న సామ్ కొన్ స్టాస్ 60 పరుగులు చేయగా, ఖవాజా 57 పరుగులు, లబ్ షంగే 72 పరుగులు చేశారు. అయితే మొదటి రోజు ఆటను అరగంట పాటు పొడిగించారు. నిర్ణీత 90 ఓవర్లు వేయాల్సి ఉండగా వేయలేదు. దీంతో 90 ఓవర్లు పూర్తి చేయడానికి అదనంగా 30 నిమిషాలు పొడిగించారు. 90 ఓవర్లు సమయానికి పూర్తి కానప్పుడు ఇది ప్రామాణిక పద్ధతి అని చెబుతున్నారు. వర్షం లేదా ఏదైనా ఇతర అంతరాయాలు ఏర్పడినప్పుడు కూడా మ్యాచ్ సమయాన్ని పొడిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


Post a Comment

0 Comments

Close Menu