Ad Code

ఢిల్లీ విమానాశ్రయంలో రూ. 17 కోట్ల డ్రగ్స్ పట్టివేత


ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులు గుట్టుగా డ్రగ్స్ తీసుకెళ్లేందుకు ఏకంగా వీడొక్కడే సినిమా లెవల్లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో డ్రగ్స్ తీసుకెళ్లేందుకు క్యాప్సెల్స్ రూపంలో వాటిని రూపొందించుకుని నోటి ద్వారా మింగి అక్రమంగా రవాణా చేసే ప్రయత్నం చేస్తారు. అయితే వీరు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయారు. వారి నుంచి 17 కోట్ల రూపాయల విలువైన కొకైన్‌తో నిండి ఉన్న 156 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఫిలిప్పీన్స్ పౌరులుగా గుర్తించబడ్డారు. ఆ ఇద్దరు ప్రయాణికులు కొకైన్‌తో నిండి ఉన్న 156 క్యాప్సూల్స్‌ను తమ కడుపులో మింగినట్లు అంగీకరించారు. ఆ క్యాప్సూల్స్‌ని వారు ఇండియాలో సేల్ చేసేందుకు సిద్ధమైనట్లు అధికారులు గుర్తించారు. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తెలిపిన ప్రకారం వారిలో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు ఉన్నారు. మరింత సమాచారం కోసం అధికారిక విచారణ కొనసాగుతోంది.



Post a Comment

0 Comments

Close Menu