Ad Code

చౌటుప్పల్ బస్టాండ్‌లో 14 కిలోల గంజాయి పట్టివేత !


ఆంధ్రప్రదేశ్ లోని నర్సీపట్నం నుంచి 14 కిలోల గంజాయితో నలుగురు వ్యక్తులు బయలుదేరారు. వారు హైదరాబాద్ వచ్చి దానిని విక్రయించాల్సి ఉంది.. ఈ క్రమంలోనే తనిఖీలు జరుగుతుండటంతో భయపడి చౌటుప్పల్ బస్టాండ్‌లో ఆగిపోయారు. అయితే. వారికి హైదరాబాద్ కు చెందిన గంజాయ్ దిగుమతి చేసుకునే వ్యక్తి రూట్ మ్యాప్ చెబుతున్నాడు. అలా మధ్యాహ్నం అయ్యింది. అప్పుడే పోలీసులు ఎంటరయ్యారు. బిత్తర చూపులు చూస్తున్న ముగ్గురిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు.. వారి వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా అసలు గంజాయ్ గుట్టు గుప్పుమన్నది. గంజాయిని రవాణా చేయడంతోపాటు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రాకెట్‌ను చౌటుప్పల్ పోలీసులతో కలిసి ఎల్బీ నగర్ జోన్ ఎస్‌ఓటీ బృందం ఛేదించింది. ఎల్‌బీ నగర్ జోన్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) సిబ్బంది అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రాకెట్‌ను అడ్డుకుని ఒక మహిళతో సహా 3 డ్రగ్ పెడ్లర్‌లను పట్టుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్లు, 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 4,01,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. నర్సీపట్నం నివాసి చెల్లూరి నాగవెంకట కృష్ణవేణి కూలీ పనులు చేస్తూ.. గంజాయి అక్రమ రవాణా చేసేది.. అనకాపల్లి జిల్లా కొత్తకోటకు చెందిన అడ్డూరి ప్రసాద్, పెద్దపేట గ్రామానికి చెందిన కిమిడి ప్రశాంత్ ఇద్దరూ ఆటోడ్రైవర్లు.. ముగ్గురిలో కృష్ణవేణి, ప్రసాద్ గతంలో జైలు జీవితం గడిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురూ కలిసి నర్సీపట్నం నుంచి 14 కిలోల గంజాయిని రవాణా చేసేందుకు.. అక్కడ రూ. కిలో 5,000 చొప్పున కొన్నారు.. హైదరాబాద్‌లో కిలో 12,000 చొప్పున అమ్మేందుకు లగేజీ బ్యాగ్‌లో దాచి తరలిస్తున్నారు. వారు మొదట నర్సీపట్నం నుండి హైదరాబాదుకు బస్సు ఎక్కారు.. కాని ప్రత్యక్ష మార్గంలో పోలీసు తనిఖీలకు భయపడి, వారు చౌటుప్పల్‌లో దిగారు.. హైదరాబాద్‌కు చెందిన త్రిభువన గోపాల్ రేవార్ తదుపరి సూచనల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో పోలీసులు చౌటుప్పల్ బస్టాండ్ వద్ద నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అసలు వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu