Ad Code

తగ్గిన బంగారం ధరలు - పెరుగుతున్న క్రిప్టో కరెన్సీల ధరలు !


క్విటీ మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్న వేళ నేడు పసిడి తిరిగి తన పతనాన్ని కొనసాగిస్తోంది. ఒకపక్క పసిడి ధరలు పడిపోతుండగా, మరో పక్క క్రిప్టో కరెన్సీల ధరలు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ట్రంప్ క్రిప్టోలకు అనుకూలంగా ఉండటంతో వీటిలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.10,000 తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7200, ముంబైలో రూ.7200, ఢిల్లీలో రూ.7215, కలకత్తాలో రూ.7200, బెంగళూరులో రూ.7200 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.10,900 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7855, ముంబైలో రూ.7855, ఢిల్లీలో రూ.7870, కలకత్తాలో రూ.7855, బెంగళూరులో రూ.7855గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7855 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7855 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 తగ్గి రూ.1,00,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu