Ad Code

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు !


హారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయవంతమైన కారణంగా సూచీలు వరుసగా రెండో రోజు కూడా మంచి లాభాలు రాబట్టాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ వంటి దిగ్గజ షేర్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 80,000 పాయింట్లను మరోసారి దాటగా, నిఫ్టీ ,200 పాయింట్లకు పైగా నిలిచింది. ఈ రోజు ఉదయం 80,193.47 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై సెన్సెక్స్‌ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఇందులో ఇన్రాడేలో 1,300 పాయింట్లకు పైగా పెరిగి 80,473.08 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 992.74 పాయింట్ల లాభంతో 80,109.85 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 314.65 పాయింట్ల లాభంతో 24,221.90 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే కొంత బలపడి 84.30కి చేరింది. 

Post a Comment

0 Comments

Close Menu