ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్రూమ్కు గురువారం ఉదయం ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అందులో ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలి నుంచి వచ్చిన ఫోన్ కాల్ను ట్రేస్ చేస్తున్నారు. సదరు మహిళ మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
0 Comments