మహారాష్ట్ర లోని నవీ ముంబైలో జవహరలాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ నందు భారత్లోనే అతిపెద్ద గిడ్డంగి నిర్మాణం కోసం రూ.2,700 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్స్పన్ వన్ కంపెనీ తెలిపింది. వెల్స్పన్ వన్ సరుకు రవాణా, ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ కంపెనీ. మొదట రూ.700 కోట్ల పెట్టుబడితో 12 లక్షల చదరపు అడుగుల పార్కుగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ను ఇప్పుడు 44.50 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాకు పెంచారు. ఈ పార్కును గిడ్డంగులు, కార్యాలయ స్థలానికి, పారిశ్రామిక ప్రాజెక్టుల అవసరానికి ఉపయోగించాలని సంస్థ యోచిస్తోంది. 55 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ లాజిస్టిక్ ప్రాజెక్ట్ 5,000 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.
0 Comments