Ad Code

శబరిమల అయ్యప్ప మెట్లపై ఫోటో దిగిన 23 మంది పోలీసులపై క్రమశిక్షణా చర్యలు !


బరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న పవిత్రమైన 18 మెట్లపై 23 మంది పోలీసులు గ్రూప్ ఫోటో దిగిన ఘటనలో ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకున్నది. ఆ పోలీసులు తక్షణమే సత్ర్పవర్తన కోసం కఠినమైన శిక్షణ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఏపీ క్యాంప్‌కు చెందిన పోలీసు ఆఫీసర్లు ఇప్పుడు కన్నౌర్‌లోని కేఏపీ-4 క్యాంపునకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ క్యాంపులో సత్ర్పవర్తన పొందేలా పోలీసులకు కఠిన శిక్షణ ఇవ్వనున్నారు. ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ ఆదేశాల మేరకు శిక్షణ కొనసాగనున్నది. క్రమశిక్షణ చర్యల గురించి హైకోర్టుకు తెలియజేశారు. అయ్యప్ప సన్నిధానంలో మెట్లపై నిలుచుని ఫోటో దిగిన పోలీసులు తమ వెనుక భాగాన్ని దేవుడి వైపు ఉంచారు. దీని పట్ల వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో 23 మంది ఆఫీసర్లను శిక్షణ కోసం వెనక్కి రప్పించారు. సన్నిధానం స్పెషల్ ఆఫీసర్ నుంచి కూడాఏడీజీపీ రిపోర్టును కోరారు. 18 మెట్లపై పోలీసులు ఫోటోషూట్ చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది. అయ్యప్ప భక్తులు ఎవ్వరూ దేవుడికి వెన్ను చూపించరని పేర్కొన్నది. ఆలయ పవిత్రతను పోలీసులు దెబ్బతీసినట్లు వీహెచ్‌పీ ఆరోపించింది.

Post a Comment

0 Comments

Close Menu