ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీల, గరిష్ఠాల వద్ద మరోసారి మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ దశలో 600 పాయింట్ల మేర నష్టాల్లోకి వెళ్లిన సెన్సెక్స్, ఆఖర్లో మళ్లీ కోలుకుంది. చివరికి ఫ్లాట్గా ముగిసింది. మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచగా, ఐటీసీ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ షేర్లు అండగా నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 80,170 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,924.77) లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు లాభాల్లో కొనసాగిన సూచీ.. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 79,464.38 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. ఆఖర్లో మళ్లీ కోలుకుని 27 పాయింట్ల నష్టంతో 79,897.34 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 8.50 పాయింట్ల నష్టంతో 24,316 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.56 గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
0 Comments